కీవ్: ఉక్రెయిన్పై శుక్రవారం రష్యా భీకర దాడి చేసిన విషయం తెలిసిందే. సుమారు 150 డ్రోన్లు, మిస్సైళ్లతో అటాక్ చేసింది. అయితే ఓ మిస్సైల్(Russian missile) పొరుగు దేశం పోలాండ్లోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. దాదాపు మూడు నిమిషాల పాటు ఆ మిస్సైల్ పోలాండ్ ఎయిర్స్పేస్లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత అది ఉక్రెయిన్ వైమానిక క్షేత్రం వైపు మళ్లినట్లు మిలిటరీ అధికారులు చెబుతున్నారు.
పోలాండ్లోని 40 కిలోమీటర్ల లోపలికి రష్యా మిస్సైల్ ప్రయాణించినట్లు జనరల్ వీస్లా కుక్లా తెలిపారు. పోలాండ్ రేడార్లో రష్యా క్షిపణి చిక్కడంతో ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రేజ్ దుడా అత్యవసర భేటీ నిర్వహించారు.అయితే ఎక్కడైతే ఆ క్షిపణిని గుర్తించారో, ఆ ప్రదేశానికి సుమారు 200 మంది పోలీసులు వెళ్లి దాని కోసం అన్వేషిస్తన్నారు.
ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత శుక్రవారం జరిగిన దాడే భీకరమైందని భావిస్తున్నారు. ఆ అటాక్లో సుమారు 30 మంది మరణించారు. కీవ్, ఒడిసా, నిప్రోపెట్రోస్కీ, ఖార్కివ్, లివివ్ పట్టణాలపై అటాక్ జరిగింది. మొత్తం 160 మంది గాయపడ్డారు.