న్యూఢిల్లీ : రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు భారత్లో పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) బుధవారం తెలిపింది. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి భారత్లో పర్యటిస్తుండడం ఆసక్తికరంగా మారింది. సెర్గీ రెండు రోజుల పాటు చైనాలో పర్యటిస్తున్నారు. లావ్రోవ్ భారత పర్యటన యూఎస్ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు దలీప్ సింగ్, బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ల పర్యటనతో సమానంగా ఉండనున్నది. ట్రస్ గురువారం భారత్ను సందర్శించనుండగా.. దలీప్ సింగ్ బుధ, గురువారాల్లో భారత్లో పర్యటిస్తున్నారు. జర్మనీ విదేశీ, భద్రతా విధాన సలహాదారు జెన్స్ ప్లాట్నర్ భారత పర్యటన కొనసాగుతున్నది.