కీవ్: జపోరిజియా అణు శక్తి కేంద్రాన్ని రష్యా దళాలు స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. గురువారం రష్యా చేసిన దాడిలో జపోరిజియా ప్లాంట్ ప్రమాదానికి గురైంది. ఫైరింగ్ వల్ల ఆ ప్లాంట్లో మంటలు వ్యాపించిన విషయం తెలిసిందే. అయితే ఆ మంటల్ని ఫైర్ఫైటర్స్ ఆపినట్లు ఇవాళ తెలిపారు. న్యూక్లియర్ ప్లాంట్లో ఉన్న పవర్ యూనిట్లను అక్కడే ఉన్న సిబ్బంది మానిటర్ చేస్తున్నారని స్థానికులు తెలిపారు. ప్లాంట్ దాడిలో రియాక్టర్ నెంబర్ వన్లో స్వల్పంగా డ్యామేజ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రమాదం వల్ల పవర్ యూనిట్ భద్రతకు ఎటువంటి విఘాతం లేదన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు.