వార్సా : ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో పోలాండ్లోని రష్యా రాయబారికి చేదు అనుభవం ఎదురైంది. రష్యా రాయబారి సెర్గీ ఆండ్రివ్పై పోలాండ్లో నిరసన కారులు రెడ్ పెయింట్ చల్లడంతో పాటు రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికులకు నివాళులు అర్పించకుండా అడ్డుకున్నారు. అయితే, ఈ ఘటనతో పోలాండ్ ప్రభుత్వం విమర్శల పాలైంది. దౌత్యవేత్తకు భద్రత కల్పించడంలో విఫలమయ్యారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
The #Russian delegation was not greeted as warmly as they expected. pic.twitter.com/HiKzuDzc1F
— NEXTA (@nexta_tv) May 9, 2022
విక్టరీ డే సందర్భంగా నివాళులర్పించేందుకు పోలాండ్లో రష్యా రాయబారి సెర్గీ ఆండ్రీవ్ వార్సాలోని సోవియట్ సైనికుల శ్మశాన వాటిక వద్దకు చేరుకున్నారు. ఇక్కడ పలువురు నిరసన కారులు రాయబారిపై రెడ్ పెయింట్ చల్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆండ్రీవ్పై దాడిని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిది మరియా జఖరోవా ఖండించారు. ఈ ఘటనతో రష్యా భయపడబోదని స్పష్టం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ సాధించిన విజయాన్ని గుర్తుచేసే విక్టరీ డే, మాస్కోలోని రెడ్ స్క్వేర్లో కవాతును ఘనంగా నిర్వహించారు.
The #Russian ambassador to #Poland was doused with red paint while laying flowers at the cemetery of Soviet soldiers. pic.twitter.com/ltA9mRVyyD
— NEXTA (@nexta_tv) May 9, 2022