భారత్, చైనా మధ్య జరుగుతున్న సరిహద్దుల ఘర్షణ విషయంలో తాము తలదూర్చమని రష్యా తేల్చి చెప్పింది. ఒకవేళ ఇరు దేశాలు తాము మధ్యవర్తిత్వం వహించాలని భావిస్తే మాత్రం… ఆ విషయాన్ని తాము కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటామని భారత్లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన రష్యా రాయబారి డేనిస్ అలిపోవ్ అన్నారు. ‘భారత్, చైనా మధ్య నడుస్తున్న సరిహద్దు ఘర్షణల్లో మేం తలదూర్చం. మధ్యవర్తిత్వం వహించే ఆలోచన కూడా మాకు లేదు. అయితే.. ఇరు దేశాలు తమ మధ్యవర్తిత్వాన్ని కోరుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి, ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. సరిహద్దు వివాదం పూర్తిగా వారి ద్వైపాక్షిక అంశం’ అని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ తేల్చి చెప్పారు.