మాస్కో, జూన్ 27: వాగ్నర్ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్ నేతృత్వంలో ఇటీవల జరిగిన సాయుధ తిరుగుబాటుపై క్రిమినల్ విచారణను మూసి వేశామని రష్యా అధికారులు మంగళవారం వెల్లడించారు. తిరుగుబాటులో పాల్గొన్న వారందరిపైనా ఎలాంటి దర్యాప్తు ఉండదని తెలిపారు. నేర కార్యకలాపాలను నిలిపేయడంతో తిరుగుబాటుదారులపై దర్యాప్తుకు స్వస్తి పలుకుతున్నట్టు ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ తెలిపింది.
తిరుగుబాటుదారులు దేశద్రోహులని రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా మరోసారి వ్యాఖ్యానించారు. అయితే దీని తర్వాత కూడా వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటుపై విచారణ జరపకుండా వదిలేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ప్రిగోజిన్ను బెలారస్కు పంపేస్తామని రష్యా ప్రకటించినప్పటికీ, ఆ విషయాన్ని బెలారస్ ప్రభుత్వం ఇప్పటికీ ధ్రువీకరించలేదు. మరోవైపు ప్రిగోజిన్ వాడే బిజినెస్ జెట్ మంగళవారం బెలారస్లోని మిన్స్ నగరంలో ల్యాండ్ అయిందని వార్తలు వచ్చాయి.