కీవ్, ఏప్రిల్ 28: ఉక్రెయిన్పై రష్యా మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది. పలు నగరాలపై జరిపిన ఈ దాడుల్లో కనీసం 12 మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు మృతి చెందినట్టు ప్రాథమిక అంచనా. ఉమన్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 16 మంది మృతి చెందారని, 17 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అంతర్గత మంత్రి ఇహోర్ ైక్లెమెంకో తెలిపారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. కాగా, రష్యా ప్రయోగించిన 11 క్రూయిజ్ క్షిపణులు, రెండు డ్రోన్లను కూల్చివేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది.