శాన్ఫ్రాన్సిస్కో: మనిషి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే ‘స్మార్ట్ ఉంగరాన్ని’ మొవానో హెల్త్ అనే అమెరికా కంపెనీ తయారుచేసింది. ఈ ఉంగరం పేరు ఈవీ. ప్రత్యేకించి మహిళల కోసం ఈ ఉంగరాన్ని రూపొందించింది. ఈ ఉంగరం ధరిస్తే.. హార్ట్ రేట్, ఆక్సిజన్ లెవల్, స్కిన్ టెంపరేచర్ వంటి పూర్తి ఆరోగ్య సమాచారాన్ని ఇది తెలియజేస్తుంది. అంతేకాదు, మహిళల రుతుస్రావం, అండోత్పత్తి, రుతుస్రావ లక్షణాలను కూడా పర్యవేక్షిస్తుంది. మహిళల సంపూర్ణ ఆరోగ్యం, వారి జీవితాలు మెరుగుపర్చడంలో ఈ ఉంగరం చాలా ఉపయోగపడుతుందని మొవానో హెల్త్ సంస్థ చెబుతున్నది. దీని ధర దాదాపుగా రూ.25 వేలు ఉంటుందని, ఈ ఏడాదే ఇది అమెరికన్ మార్కెట్లోకి అందుబాటులో వస్తుందని ప్రకటించింది.