న్యూయార్క్: ‘రిచ్ డాడ్, పూర్ డాడ్’ రచనతో పేరొందిన ప్రముఖ ఆర్థిక రచయిత, వ్యాపారవేత్త, జపాన్ అమెరికన్ రాబర్ట్ కియోసాకి సంచలన విషయాన్ని బయటపెట్టారు. తనకు ఒక బిలియన్ డాలర్లు (రూ.8,300 కోట్లు) కంటే ఎక్కువ అప్పు ఉందని, అయితే అది తన సమస్య కాదని చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన ఆస్తులు, అప్పుల మధ్య క్లిష్టమైన వ్యత్యాసాన్ని వివరించారు. చాలామంది రుణాలతో అప్పులను కొనుగోలు చేస్తారని, కానీ తాను ఆస్తులను మాత్రమే కొంటానని తెలిపారు. దీనికి ఉదాహరణగా పేర్కొంటూ.. తన లగ్జరీ కార్లు ఫెరారీ, రోల్స్ రాయిస్లను పూర్తిగా నగదు చెల్లించి కొనుగోలు చేశానని, ఎందు కంటే అవి ఆస్తుల క్యాటగిరీ కిందకు రావని అప్పుల కిందకే వస్తాయని అన్నారు. మంచి రుణాలు సంపదను సృష్టిస్తాయని, చెడ్డ రుణాలు మరింత అప్పుల్లోకి నెడతాయని, ఇది ఆయా వ్యక్తులు వినియోగించే విధానం బట్టి ఉంటుందని అన్నారు.