బాలి: రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లవ్రోవ్ ఆస్పత్రిపాలైనట్లు ఇండోనేషియాలోని ఓ మీడియా సంస్థ వార్తను ప్రచురించింది. అయితే, ఆయన ఏ సమస్యతో ఆస్పత్రి పాలయ్యారో ఆ మీడియా సంస్థ పేర్కొనలేదు. పైగా ఈ విషయాన్ని ఇండోనేషియా అధికారులు వెల్లడించారని పేర్కొన్న మీడియా సంస్థ.. ఆ అధికారులు ఎవరనే విషయాన్ని స్పష్టంచేయలేదు.
కాగా, రష్యా ఫారిన్ మినిస్టర్ సెర్గీ లవ్రోవ్.. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తరఫున జీ-20 సమ్మిట్లో పాల్గొనేందుకు ఆదివారం ఇండోనేషియాలోని బాలి ద్వీపానికి చేరుకున్నారు. ఈ క్రమంలో బాలిలో ఆయన ఆస్పత్రిపాలైనట్లు వార్తలు వచ్చాయి. కాగా, సెర్గీ ఆరోగ్యం గురించి వచ్చిన వార్తలు పూర్తిగా ఫేక్ అని రష్యా విదేశాంగ శాఖ స్పష్టంచేసింది.