పారిస్: ఫ్రాన్స్లోని పారిస్ నగర ప్రజలు రెంటల్ ఈ-స్కూటర్ల(e-scooters)ను బ్యాన్ చేయాలని కోరుతున్నారు. రెంట్కు ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ల వల్ల .. స్కూటర్ ఆపరేటర్లుకు భారీ నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. రోడ్డు భద్రత(raod safety) దృష్ట్యా ఈ చర్యలు తీసుకోవాలని రెఫరెండమ్లో ప్రజలు కోరారు. ఆదివారం జరిగిన రెఫరెండమ్(referendrum)లో 90 శాతం మంది ఓటర్లు బ్యాటరీ స్కూటర్లను బ్యాన్ చేయాలని కోరారు. ఈ-స్కూటర్లపై గాయపడ్డ, మరణించిన వ్యక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పారిస్ నగరంలో ఈ రెఫరెండమ్ చేపట్టారు. 13 లక్షల జనాభాలో కేవలం లక్ష మంది మాత్రమే ఓటింగ్లో పాల్గొన్నారు. దాంట్లో ఈ-స్కూటర్లకు వ్యతిరేకంగా 91 వేల మంది ఓటేశారు. ఎలక్ట్రిక్ వాహనాలకు(electric vehicles) పారిస్లో ఆదరణ ఎక్కువగా ఉంది. కానీ వాటి వల్ల మంచి కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.