విస్కిన్సన్: అమెరికాలోని విస్కిన్సన్లో ఓ ఉన్మాది కారుతో బీభత్సం సృష్టించాడు. క్రిస్మస్ పరేడ్ను టార్గెట్ చేశారు. ఈ ఘటనలో 28 మంది గాయపడ్డారు. కొందరు మరణించినట్లు పోలీసులు చెప్పారు. అయితే ఈ ప్రమాదంలో సుమారు 20 మంది చిన్నారులు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫూటేజ్ను రిలీజ్ చేశారు. ఎరుపు రంగులో ఉన్న ఓ ఎస్యూవీ కారు.. పరేడ్ తీస్తున్నవారిని వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. విస్కిన్సన్లోని వౌకేషా నగరంలో ఈ ఘటన జరిగింది. తాజా ఘటన ఉగ్రవాద ప్రేరేపితం కాదని పోలీసులు చెబుతున్నారు. కారుతో దాడి చేసిన ఘటనలో అయిదుగురు మరణించగా, 40 మంది గాయపడ్డారు.
పరేడ్లో పాల్గొన్న డ్యాన్స్ టీమ్పై కారు దూసుకువెళ్లింది. ఫుల్ స్పీడ్లో వచ్చిన కారు.. పరేడ్ దారిలో భయానకం సృష్టించింది. మార్చింగ్ చేస్తున్నవారిపైకి వెళ్లింది. రెడ్ ఎస్యూవీని పోలీసులు సీజ్ చేశారు. ఆ వ్యక్తిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. పరేడ్ మీదకు కారు దూసుకువస్తున్న సమయంలో పోలీసులు ఆ కారుపై కాల్పులు జరిపారు. ఈ కేసు విచారణలో ఎఫ్బీఐ సహకరిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
వౌకేషా సిటీలో 58వ వార్షికోత్సవం క్రిస్మస్ పరేడ్ను ఆదివారం సాయంత్రం నిర్వహించారు. చరిత్రాత్మకమైన ఆ నగరంలో ఉన్న కొన్ని వీధుల్లో ఆ ఊరేగింపు సాగనున్నది. పరేడ్కు సంబంధించిన రూట్ మ్యాప్ను ముందే రిలీజ్ చేశారు. పరేడ్ ఘటనకు చెందిన విషయాన్ని అధ్యక్షుడు జో బైడెన్కు సమాచారం ఇచ్చారు.