పాదచారులు ఈజీగా రోడ్డు దాటేందుకు నగర వ్యాప్తంగా పెలికాన్ సిగ్నల్స్ను ఏర్పాటు చేయనున్నారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు 104 సిగ్నల్స్ ఏర్పాటు కానున్నాయి. మొదటగా మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి దవాఖాన సమీపంలో పైలెట్ ప్రాజెక్ట్గా త్వరలోనే ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.