బీజింగ్: ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్తో అతలాకుతలం అవుతున్న ఇండియాకు అవసరమైన సహాయం చేయడానికి సిద్ధమని ప్రకటించింది చైనా. గురువారం ఆ దేశ అధికార మీడియాతో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ ఈ ప్రకటన చేశారు. మహమ్మారి మానవాళి మొత్తానికీ శత్రువుని, ఈ సమయంలో అంతర్జాతీయ సంఘీభావం, పరస్పరం సహాయం చేసుకోవడం అవసరమని ఆయన అన్నారు.
ఇండియాలో ఉన్న దారుణమైన పరిస్థితుల విషయం చైనా గమనించిందని, అక్కడ తాత్కాలిక మందుల కొరత ఉన్నదని చెప్పారు. మహమ్మారిని అదుపులోకి తీసుకురావడానికి అవసరమైన సహాయం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.