లండన్: మదర్స్ డేను పురస్కరించుకుని వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్ షేర్ చేసిన ఓ ఫొటో గందరగోళానికి కారణమైంది. అసలు వాస్తవాన్ని చెబుతూ క్షమాపణలు కోరారు కేట్. ఎక్స్ ఖాతా ద్వారా ఆమె స్పందించారు. తాను కూడా అందరు ఫొటోగ్రాఫర్ల వలే ఎడిటింగ్లో ప్రయోగాలు చేస్తున్నానని, తాము షేర్ చేసిన ఫొటో కూడా ఎడిటెడ్ అని, అందుకు క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు. కేట్కు శస్త్ర చికిత్స జరిగిందని ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కార్యాలయం జనవరిలో తెలియచేసింది. అప్పటి నుంచి కేట్ బయట ఎవరికీ కనిపించలేదు. దీంతో ఎన్నో వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలోనే కెన్సింగ్టన్ ప్యాలెస్ ఆదివారం ఓ ఫొటో విడుదల చేసింది.