న్యూఢిల్లీ: దక్షిణ అమెరికాలోని డ్రేక్ పాసేజ్(Drake Passage) వద్ద ఇవాళ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.5గా ఉంది. సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొన్నది. దక్షిణ అమెరికా, అంటార్కిటికా మధ్య … డ్రేక్ పాసేజ్ ఉంది. భారీ భూకంపం వల్ల ఆ ప్రాంతం వణికిపోయింది. అయితే పసిఫిక్ సునామీ కేంద్రం.. సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. తొలుత భూకంప తీవ్రతను 8.0గా ప్రకటించారు. కానీ ఆ తర్వాత యూఎస్ జియోలాజికల్ సర్వే ఆ తీవ్రతను తగ్గించింది. అర్జెంటీనాలోని ఉషైయాకు సుమారు 700 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపారు. ఉషైయా సిటీలో సుమారు 57 వేల మంది జనాభా ఉంటారు. అయితే చిలీ దేశ కోస్తా ప్రాంతానికి మాత్రం పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ స్వల్ప స్థాయిలో వార్నింగ్ జారీ చేసింది. అయితే హవాయి కానీ ఇతర సుదూర ప్రాంతాలకు ఎటువంటి సునామీ ప్రభావం ఉండదని పేర్కొన్నది.
EQ of M: 7.4, On: 22/08/2025 07:46:22 IST, Lat: 60.26 S, Long: 61.85 W, Depth: 36 Km, Location: Drake Passage.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/o5tQQ1wIa6— National Center for Seismology (@NCS_Earthquake) August 22, 2025