దదోమా : టాంజానియాలోని విక్టోరియా నదిలో ఆదివారం ప్రయాణీకుల విమానం కుప్పకూలింది. బుకోబా ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్కు ముందు ప్రతికూల వాతావరణంతో విమానం నదిలో కూలిపోయింది. ఎయిర్పోర్ట్కు 100 మీటర్ల దూరంలో విమానం నీటిలో పడిపోయిందని స్ధానిక పోలీస్ కమాండర్ విలియం వాంపగలే వెల్లడించారు.
విమానంలో ఎంతమంది ప్రయాణీకులున్నారనే వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. ప్రమాద స్ధలం నుంచి 23 మంది ప్రయాణీకులను సహాయ సిబ్బంది కాపాడారు. కాగా దారుసలాం నుంచి బుకోబాకు బయలుదేరిన ఈ విమానంలోదాదాపు 49 మంది ప్రయాణీకులు ఉంటారని స్ధానిక మీడియా పేర్కొంది. ప్రయాణీకులను కాపాడేందుకు సెక్యూరిటీ బృందాలు ముమ్మరంగా పనిచేస్తున్నాయని పరిస్ధితి అదుపులో ఉందని పోలీస్ కమాండర్ విలియం పేర్కొన్నారు.
టాంజానియాలో అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్లైన్ ప్రిసిషన్ ఎయిర్ విమాన ప్రమాదాన్ని ధ్రువీకరించింది. సహాయ పునరావస బృందం ఘటనా స్ధలానికి చేరుకుందని, మరికొన్ని గంటల్లో పూర్తి సమాచారం వెల్లడవుతుందని ప్రిసిషన్ ఎయిర్ ఓ ప్రకటనలో పేర్కొంది.