ఇస్లామాబాద్: పార్టీ ఫిరాయించిన ఎంపీలకు పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కి చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాన్ పార్టీ నోటీసులు జారీచేసింది. ఈ నెల 26లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇమ్రాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం త్వరలో జరుగనుండగా దాదాపు 25 మంది ఎంపీలు అధికార పార్టీని వీడారు. దీంతో ప్రభుత్వం మైనార్టీలో పడింది.