పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ అమెరికాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రష్యా పర్యటనకు వెళ్లడం వల్లే తనపై తీవ్ర కోపాన్ని పెంచుకుందని ఇమ్రాన్ సంచలన ఆరోపణలకు దిగారు. ఇస్లామాబాద్లో శుక్రవారం భద్రతపై ఓ సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే ఓ వీడియో చూశా. ఓ పవర్ ఫుల్ దేశం ఇండియాకు మద్దతిస్తూ మాట్లాడింది. ఇండియా ఓ స్వతంత్ర దేశమని, ఇండియాకు ఏమీ చెప్పలేమని బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి అన్నారు.
ఇండియాకు మద్దతిచ్చినందుకే నాకేమీ బాధలేదు. తప్పంతా మన దేశానిదే అంటూ ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను చాలా నాశనం చేశాయని, దీని కారణంగా ప్రపంచ పటంపై పాక్ బలహీనపడిందని తీవ్రంగా మండిపడ్డారు. ఇక.. తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, దానికి సంబంధించిన లేఖ కూడా ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై కూడా ఇమ్రాన్ మళ్లీ స్పందించారు. అన్ని దేశాలనూ తాము గౌరవంగానే చూస్తామని, కానీ.. ఓ దేశాన్ని మరో దేశం బెదిరించవచ్చా? అంటూ సూటిగా ఇమ్రాన్ ప్రశ్నించారు.