టీకా వేసుకున్నవారినే రానిస్తామని వెల్లడి
ఇస్లామాబాద్, ఆగస్టు 22: పాకిస్తాన్లోని కర్తార్పూర్లో ఉన్న గురుద్వారా దర్బార్ సాహిబ్ యాత్ర వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నది. రెండు డోసుల కరోనా టీకా వేసుకొన్న భారత యాత్రికులను గురుద్వారా సందర్శనకు అనుమతిస్తామని పాక్ ప్రకటించింది. కఠినమైన కొవిడ్ నిబంధనల మధ్య యాత్ర ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా ఉద్ధృతి కారణంగా గతేడాది మార్చి నుంచి కర్తార్పూర్కు యాత్రికులను అనుమతించడం లేదు. సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 482వ వర్ధంతి (సెప్టెంబర్ 22) సందర్భంగా ఈ యాత్ర ప్రారంభం కానుంది. గురుద్వారాలో సెప్టెంబర్ 20 నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి.