వాషింగ్టన్: ఒమిక్రాన్ కరోనా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రబలుతున్నట్లు అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ తెలిపారు. అమెరికన్లు అందరూ త్వరగా వ్యాక్సిన్ వేసుకోవాలని, వీలైనవాళ్లు బూస్టర్ డోసు తీసుకోవాలని ఆయన సూచించారు. అమెరికాలో ఇప్పటికే ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని, కొత్త వేరియంట్ అమెరికన్లపై పెను ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఫౌసీ తెలిపారు. దక్షిణాఫ్రికాతో పాటు 8 ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న విమాన ప్రయాణికులపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.