ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా ఇవాళ స్వల్ప స్థాయి మిస్సైల్ను పరీక్షించింది. ఆ క్షిపణి తూర్పు తీరంలో పడినట్లు దక్షిణ కొరియా మిలిటరీ తెలిపింది. ఆత్మరక్షణ కోసం ఆయుధాలను సమీకరిస్తామని, వాటిని పరీక్షిస్తుంటామని ఇటీవల ఉత్తర కొరియా అంబాసిడర్ ఐక్యరాజ్యసమితిలో ప్రకటించారు. అయితే ఈ నెల ఆరంభంలో ఉత్తర కొరియా .. బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను పరీక్షించిన విషయం తెలిసిందే. మరో వైపు దక్షిణ కొరియాతో చర్చలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ఉత్తర కొరియా ప్రకటించింది. ఇవాళ జరిగిన పరీక్షపై జపాన్ మీడియా కామెంట్ చేసింది. బహుశా బాలిస్టిక్ మిస్సైల్ను పరీక్షించి ఉంటారని జపాన్ రక్షణశాఖ పేర్కొన్నట్లు తెలిపింది.