నేటి సమాజానికి రాచరికం అవసరమా? అంటూ బ్రిటన్ ప్రజలు నిలదీశారు. ఓ వైపు రాణి ఎలిజబెత్-2 మరణంపై వేల మంది సంతాపం తెలుపుతుంటే.. మరోవైపు రాచరికం ఇక వద్దంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. రాచరికాన్ని వ్యతిరేకిస్తూ పలువురు నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. ‘మాకు రాచరికం వద్దు.. నీవు మా రాజు కాదు.. అసలు మిమ్మల్ని ఎవరు ఎన్నుకున్నారు’ అని ప్రిన్స్ చార్లెస్ను ఉద్దేశిస్తూ ప్లకార్డుల్లో రాసి ఉన్నది.