లండన్, జూలై 5: అతినీలలోహిత (యూవీ) కిరణాలను ప్రసరింపజేసి ప్లాస్టిక్ను విచ్ఛిన్నం చేసే కొత్త సాంకేతికతను ఇంగ్లండ్లోని యూనివర్సిటీ ఆఫ్ బాత్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్లాస్టిక్ రేణువులకు షుగర్ అణువులు జత చేసి.. దాని మీదుగా యూవీ కాంతిని ప్రసరిస్తే ప్లాస్టిక్ విచ్ఛిన్నమవుతున్నట్టు గుర్తించామని ఆంటోయిన్ బుచార్డ్ తెలిపారు.
ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా పాలీలాక్టిక్ యాసిడ్ (పీఎల్ఏ)ను వినియోగిస్తున్నారని, పునరుత్పాదకమైనవిగా పేర్కొనే ఈ తరహా ప్లాస్టిక్ నేలలో కలిసిపోవాలంటే అధిక ఉష్ణోగ్రతలు, తేమ ఉండాల్సిందేనన్నారు. పరిశ్రమల్లోనే ఈ పరిస్థితులను కల్పించగలమని పేర్కొన్నారు. అయితే, పీఎల్ఏ ప్లాస్టిక్కు 3 శాతం షుగర్ పాలిమర్ యూనిట్లను కలిపి యూపీ కాంతిని ప్రసరిస్తే ఆరు గంటల్లోనే 40 శాతం ప్లాస్టిక్ విచ్ఛిన్నం అవుతుందని వెల్లడించారు.