నేపాల్లో తారా ఎయిర్ 9 NAET ట్విన్-ఇంజిన్ విమానం ఆచూకీ దొరకడం లేదు. 22 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఈ విమానం ఆచూకీ దొరకడం లేదని, ఏటీసీతో ఈ విమానానికి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ 22 మంది ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు, ముగ్గురు జపాన్ పౌరులు, మిగితా వారందరూ నేపాల్ పౌరులే వున్నారు.
ఈ విమానం ఉదయం 9ః55 నిమిషాలకు పోఖ్రా నుంచి జోమ్సోమ్కు బయల్దేరిందని, ఆ తర్వాత ఏటీసీతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయని అధికారులు పేర్కొంటున్నారు. విమానాన్ని ముస్తాంగ్ జిల్లాలోని జోమ్సోమ్ ప్రాంతంలో మొదట గుర్తించామని, తర్వాత మౌంట్ ధౌలగిరి వైపు మళ్లిందని అధికారులు అంటున్నారు. దీని తర్వాత మాత్రం తమతో టచ్లో లేకుండా పోయిందని పేర్కొంటున్నారు. దీని ఆచూకీని గుర్తించడానికి ఇతర విమానాలను ఉపయోగిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు.