Elan Musk : అమెరికాతో పోల్చితే భారత్ , ఇండోనేషియా దేశాల్లో ట్విట్టర్ ఆండ్రాయిడ్ యాప్ వేగం ఐదు నుంచి పదింతలు తక్కువ ఉందని కొద్ది రోజుల క్రితం ఎలన్ మస్క్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అమెరికాలో మాత్రం 2 సెకన్లలో ట్విట్టర్ రిఫ్రెష్ అవుతుంది. కానీ, భారత్, ఇండోనేషియాలో ట్విట్టర్ రిఫ్రెష్ కావడానికి 10 నుంచి 20 సెకన్లు పడుతుంది. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన మస్క్ ఇదే విషయమై గురువారం మరో ట్వీట్ను పోస్ట్ చేశాడు. ఆ ట్వీట్లో.. ‘ట్విట్టర్ వేగానికి సంబంధించి చిన్న, భారీ మార్పులను గమనిస్తారు. మరీ ముఖ్యంగా అమెరికాకు దూరంగా ఉన్న దేశాల్లో ఈ మార్పులు కనిపిస్తాయి. అయితే, కొన్నిసార్లు ఆండ్రాయిడ్ ఫోన్లలో ట్విట్టర్ యాప్ మొత్తానికే పనిచేయకపోవచ్చు’ అని మస్క్ ట్వీట్లో తెలిపాడు.
టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేసిన తర్వా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాడు. వీళ్లలో ఆండ్రాయిడ్ యాప్ ఇంజినీర్లను కూడా ఉన్నారు. దాంతో, ఆండ్రాయిడ్ యాప్లలో ట్విట్టర్ వేగం తగ్గిపోయింది. అంతేకాదు ఈమధ్యే కాపీరైట్ స్ట్రైక్ వ్యవస్థ పనిచేయలేదు. యూజర్లు తమకు నచ్చిన సినిమాలు, టీవీ షోలను ట్విట్టర్లో అప్లోడ్ చేశారు.
You might notice small, sometimes major, improvements in speed of Twitter. Will be especially significant in countries far away from USA.
— Elon Musk (@elonmusk) November 24, 2022