బెర్లిన్, ఆగస్టు 31: టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్కు చెందిన డిర్క్ స్కుల్జ్ మాకుచ్ అనే ఖగోళ జీవశాస్త్ర శాస్త్రవేత్త సంచలన ప్రకటన చేశారు. 50 ఏండ్ల క్రితమే అంగారకుడిపై(మార్స్) జీవం కనుగొనబడిందని, అయితే అనుకోకుండా అది ఆ తర్వాత నాశనమైందని పేర్కొన్నారు.
నాసా 1970 దశకం మధ్యలో ఓ ప్రయోగం ద్వారా రెండు ల్యాండర్లను మార్స్ ఉపరితలంపైకి పంపిందని తెలిపారు. మట్టి నమూనాలపై జీవ విశ్లేషణలు జరపగా సూక్ష్మజీవులు ఉన్నట్టు ప్రాథమిక పరిశోధనల్లో తేలిందని పేర్కొన్నారు.