కాట్మాండు: నేపాల్లోని భోటెకోషి నది ఒక్కసారిగా ఉప్పొంగింది. అయితే టిబెట్ వైపు నుంచి ఆ నదిలోకి బురుద నీరు ప్రవేశించింది. దీంతో దిగువ ప్రాంతాలకు హైఅలర్ట్ జారీ చేశారు. భోటికోషి నదిలోకి చైనీస్ వైపు నుంచి నీరు వచ్చినట్లు నిపుణులు అంచనా వేశారు. రాసువాలో అనేక ప్రాంతాలు డ్యామేజ్ అయ్యాయి. గోసాయికుండ రూరల్ మున్సిపాల్టీలో భారీ నష్టం జరిగింది. త్రిశూలీ నది వెంట ఉండే ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గోర్కా, చిత్వాన్ ప్రాంతాలకు కూడా అలర్ట్ ఇచ్చారు. ట్రాన్స్పోర్టు కారిడార్లు అయిన పృథ్వీ హైవే, త్రిభువన్ హైవేతో పాటు రిస్క్జోన్లో ఉన్న ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకు అకస్మాత్తుగా వరదలు వచ్చాయని నిపుణులు ఆరా తీస్తున్నారు. గ్లేసియల్ లేక్ ఔట్బస్ట్ ఫ్లడ్ కారణమా లేక మరేదైనా కారణం ఉందా అని పరీక్షిస్తున్నారు.
ఆకస్మిక వరదలపై చైనా ఓ ప్రకటన చేసింది. జిజాంగ్ ప్రాంతంలో ఉన్న గిజాంగ్ పోర్టు వద్ద మట్టిచరియలు విరిగిపడినట్లు పేర్కొన్నది. అనేక మంది మిస్సింగ్ అయినట్లు కూడా చైనా అధికారిక వార్తా సంస్థ హెచ్చరించింది. చైనాలో ల్యాండ్ పోర్టు వద్ద వరద ప్రభావానికి కమ్యూనికేషన్, పవర్ సప్లయ్లు కూడా నిలిచిపోయాయి. చైనా, నేపాల్ మధ్య గిరాంగ్ పోర్ట్ కీలకమైన పోర్టుగా ఉన్నది. రాసువా జిల్లా ఘటనలో 8 మంది మృతిచెందగా, 105 మంది గల్లంతు అయినట్లు తెలుస్తోంది.
Today, a flash flood has swept through markets, settlements, and hydropower projects along the Bhotekoshi River in Timure and Syabrubesi, Gosainkunda Rural Municipality, Rasuwa District, Bagmati Province, Nepal. pic.twitter.com/DWVsGQpRzV
— Weather Monitor (@WeatherMonitors) August 26, 2026