కట్టంగూర్(నకిరేకల్), మార్చి 21 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్రెడ్డి, వాణీదేవి విజయం పట్ల ఆయా మండలాల్లో నాయకులు, కార్యకర్తలు ఆదివారం సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచి ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు. నకిరేకల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల శంభయ్యతో కలిసి ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీరేశం మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టు లాంటిదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరుకు ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుత్తా మంజులామాధవరెడ్డి, సామ శ్రీనివాస్రెడ్డి, యానాల లింగారెడ్డి, గాదగోని కొండయ్య, పెండెం సంతోశ్, బొజ్జ సుందర్, గాదె శివ, కత్తుల వీరు, నార్కట్పల్లి రమేశ్, కొండ వెంకన్న, లక్ష్మీనారాయణ, సైదులు, బాబా, బాలు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ పాలనకు పట్టం..
జడ్పీటీసీ బలరాములు, ఏడుకొండలు
కట్టంగూర్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్రెడ్డిని గెలిపించి సీఎం కేసీఆర్ పాలనకు ప్రజలు పట్టం కట్టారని జడ్పీటీసీ తరాల బలరాములు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు అన్నారు. ఆదివారం కట్టంగూర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే నాయకుడని నమ్మిన పట్టభద్రులు పల్లాను గెలిపించారన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా పల్లాకు పట్టం కట్టడం హర్షణీయమన్నారు. సమావేశంలో సర్పంచ్ వడ్డె సైదిరెడ్డి, మాజీ ఎంపీటీసీ గుండగోని రాములు, యూత్ మండలాధ్యక్షుడు పల్నాటి నరేందర్రెడ్డి, నాయకులు బోడ యాదగిరి, నల్ల నరేశ్, రాములు పాల్గొన్నారు.
శాలిగౌరారం : మండలంలోని ఊట్కూర్ గ్రామ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. సర్పంచ్ వేముల లింగయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు రావుల శ్రీను, జహంగీర్, రావుల రామచంద్రు, నర్సింహ, బయ్యన్న, శ్రీను, వెంకన్న, రవి, అశోక్, సాయిరెడ్డి పాల్గొన్నారు.
కేతేపల్లి : మండలంలోని వివిధ గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచి పెట్టారు. మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ గుత్తా మంజుల, సర్పంచ్ జటంగి ముత్తమ్మ, నాయకులు వెంకట్రాంరెడ్డి, మాధవరెడ్డి, కె.మల్లేశ్, బి.సుందర్, మట్టి సునీతాసాల్మన్, పి.దయాకర్రెడ్డి, బి.నరేందర్, పి.గోవర్ధన్రెడ్డి, కె.మోహన్కుమార్, కర్ణాకర్రెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.
మర్రిగూడ : మండలంలోని అంతంపేటలో టీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు ఐతరాజు హనుమంతు, ఎంపీటీసీ నేనావత్ బంతిలాల్, ఉపసర్పంచ్ వీరమల్ల రాజుగౌడ్, నాయకులు మాదగోని భిక్షం, మాతంగి నరేందర్, స్వామి, సందీప్, రాఘవేందర్ పాల్గొన్నారు.