ఐక్యరాజ్యసమితి, సెప్టెంబర్ 12: ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) షాకింగ్ నిజాలు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది ఆధునిక బానిసత్వంలో బతుకుతున్నట్టు వెల్లడించింది. బలవంతంగా శ్రామికులుగా లేదా బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నట్టు తెలిపింది. ఐదేండ్ల కిందటితో పోలిస్తే ఈ సంఖ్య 25శాతం పెరిగిందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరు లైంగిక దోపిడీకి గురవుతున్నట్టు వెల్లడించింది. ఇందులో ఎక్కువగా నిరుపేద మహిళలు, బాలికలుంటున్నారని తెలిపింది. ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, కాంగో, ఈజిప్ట్, ఇండియా, ఉగాండా, యెమెన్లో బాల్య, బలవంతపు వివాహాలు ఎక్కువగా ఉన్నట్టు ఐఎల్వో రిపోర్ట్లో తెలిపింది. ఈ ఆధునిక బానిసత్వానికి అభివృద్ధి చెందిన దేశాలు కూడా మినహాయింపు కాదని, ఆయా దేశాల్లో కూడా ప్రతి నలుగురిలో ఒకరు బలవంతపు వివాహాలు చేసుకోవాల్సి వస్తున్నదని పేర్కొంది.