కొచ్చి: హిందూ మహాసముద్రంలో అక్రమంగా తరలిస్తున్న దాదాపు రూ.25వేల కోట్ల విలువైన ‘మెథాంఫిటమైన్’ మాదకద్రవ్యాన్ని సీజ్ చేశామని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సోమవారం ప్రకటించింది. భారత నౌకాదళంతో చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో 2500 కిలోల మెథాంఫిటమైన్ పట్టుబడిందని ఎన్సీబీ తెలిపింది.
ఈ దాడుల్లో ఒక పాకిస్థాన్ పౌరుడ్ని అదుపులోకి తీసుకొన్నామని, పట్టుబడ్డ డ్రగ్స్తో పాకిస్థాన్కు ఉన్న సంబంధాలపై వివిధ దర్యాప్తు ఏజెన్సీలు విచారణ జరుపుతాయని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ సింగ్ చెప్పారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించి తాజా ఘటన ఎన్సీబీ చరిత్రలో మూడో అతిపెద్దదన్నారు.