జెరూసలేం సమీపంలో ఇజ్రాయెల్ పరిశోధకుల గుర్తింపు
జెరూసలేం, మార్చి 16: క్రైస్తవ మతగ్రంథం బైబిల్ రూపకల్పన నాటి అత్యంత పురాతన రాతప్రతులను ఇజ్రాయెల్ పరిశోధకులు వెలికితీశారు. ‘డెడ్ సీ స్క్రోల్స్’గా పిలిచే ఈ రాతప్రతులను జెరూసలేం నగరానికి దక్షిణాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘కేవ్ ఆఫ్ హారర్’లో గుర్తించినట్టు మంగళవారం వెల్లడించారు. తోలుపై గ్రీక్ భాషలో యూదు మత ప్రవచనాలు రాసి చుట్టలుగా చుట్టిన వీటిని తాజా తవ్వకాల్లో గుర్తించారు. గుహలో ముక్కలుముక్కలుగా మారిన దాదాపు 80 తోలు చుట్టలు లభించాయని తెలిపారు. ఇవి క్రీస్తుశకం ఒకటవ శతాబ్దం నాటివని పురావస్తు పరిశోధకుడు ఒరెన్ అల్బమెన్ వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఇలాంటి రాతప్రతులను గుర్తించటం గత 60 ఏండ్లలో ఇదే మొదటిసారి.