లండన్, డిసెంబర్ 15: మనిషి మొదటగా నడిచింది భూమిపై కాదా? చెట్లపైనేనా? అంటే అవునంటున్నారు శాస్త్రవేత్తలు. యూనివర్సిటీ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ కెంట్, డ్యూక్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు టాంజానియాలోని చింపాంజీలపై పరిశోధన చేపట్టారు. దీంతో వాటి జీవన శైలిని పరిశీలించి, అవి ఎక్కువగా చెట్లపైనే నడుస్తున్నట్టు గుర్తించారు. చింపాంజీలు దాదాపు మనిషికి దగ్గర పోలికతోనే ఉండటం వల్ల చరిత్రకు పూర్వం మనుషులు కూడా ఇలాగే చెట్లపై నడిచారన్న అంచనాకు వచ్చారు. దీనికి సంబంధించిన అధ్యయన అంశాలు సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.