జింగ్: సాధారణంగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కార్యాలయాల్లో పార్టీలు చేసుకుంటుంటారు. వారాంతాల్లో సరదా కోసం, పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం ఇలాంటి పార్టీలు జరుపుకుంటారు. ఇటీవల చైనాలోని ఓ కంపెనీకి చెందిన ఉద్యోగులు కూడా అలాగే పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో మద్యం తాగే ముందు కంపెనీ బాస్, ఉద్యోగుల మధ్య పందెం ప్రస్తావన వచ్చింది. బాస్ యాంగ్ ఉద్యోగులతో పందెం కాసాడు.
ఒక లీటర్ మద్యం 10 నిమిషాల్లో తాగిన వారికి రూ.5 వేల యువాన్లు (సుమారు రూ.58 వేలు) బహుమతిగా ఇస్తానని ఆఫర్ చేశాడు. కానీ ఎవరూ స్పందించలేదు. దాంతో రూ.10 వేల యువాన్లు (సుమారు రూ.1.15 లక్షలు) ఇస్తానని ప్రకటించాడు. అయినా ఎవరూ రెస్పాండ్ కాలేదు. దాంతో బాస్ యాంగ్ ఏకంగా రూ.20 వేల యువాన్లు (సుమారు రూ.2.31 లక్షలు) ఆఫర్ చేశాడు.
దాంతో ఝాంగ్ అనే ఉద్యోగి బాస్ కాసిన పందేనికి సై అన్నాడు. లీటర్ మద్యం బాటిల్ సీల్ తీసి గటగటామని 10 నిమిషాల్లోపే తాగేశాడు. కానీ మద్యం తాగిన వెంటనే ఝాంగ్ స్పృహతప్పి పడిపోయాడు. సహోద్యోగులు వెంటనే ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. అతిగా మద్యం తీసుకోవడంవల్ల ఆల్కహాల్ పాయిజనింగ్, ఆస్పిరేషన్ న్యుమోనియా, ఊపిరాడకపోవడం, కార్డియాక్ అరెస్ట్ లాంటి కారణాలతో అతను మరణించి ఉంటాడని వైద్యులు చెప్పారు.