ప్రపంచంలోని ఎత్తైన శిఖరాల్లో పదోదైన మౌంట్ అన్నపూర్ణను (ఎత్తు 8,091 మీటర్లు) మహారాష్ట్రకు చెందిన ప్రియాంక మోహితే (28) అధిరోహించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు నెలకొల్పారు. ఈ వివరాలను ప్రియాంక ఉద్యోగిగా ఉన్న బయోకాన్ ఫార్మా చైర్పర్సన్ కిరణ్ మజుందార్షా ట్విట్టర్లో షేర్ చేశారు.