సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఓ విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఇటీవల అక్కడ లెట్యూస్ ఆకుకూర ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కేఎఫ్సీ తన బర్గర్లలో లెట్యూస్కు బదులుగా క్యాబేజీ వాడుతోంది. రెండింటిని 50-50 శాతంతో కలిపి కస్టమర్లకు బర్గర్లను ఇస్తోంది. ఈ అంశంపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ జోకేశారు. ఉన్నతాధికారులతో ఈ అంశాన్ని చర్చించనున్నట్లు చెప్పారు. లెట్యూస్ ఆకుకూర ధరలు పెరగడంతో కేఎఫ్సీ క్యాబేజీ వాడుతోందని, కేఎఫ్సీ నిర్ణయం క్రేజీగా ఉందని, ఇప్పుడు ఇదో జాతీయ సమస్యగా మారినట్లు ప్రధాని ఆంథోనీ ఆరోపించారు.
ఇటీవల ఆస్ట్రేలియాలో విపరీతంగా వరదలు వచ్చాయి. దీంతో లెట్యూస్ ఆకుకూర ధరలు 300 శాతం పెరిగాయి. ఇంధన ధరలు పెరగడంతోనూ గతంలో రెండు డాలర్లకు వచ్చే ఆ కూరను ఇప్పుడు 8 డాలర్లకు అమ్ముతున్నారు. సిడ్నీ, మెల్బోర్న్లో లెట్యూస్కు ఏకంగా రెక్కలొచ్చాయి. లెట్యూస్ టేస్టీ తరహాలో క్యాబేజీ ఉండదని ఓ రేడియోకు ఇచ్చిన ఇంరట్వ్యూలో ఆల్బనీస్ కామెంట్ చేవారు. క్యాబేజీ గేట్ గురించి క్యాబినెట్లో చర్చిస్తానని ఆయన మరో పంచ్ విసిరారు. ఇటీవల చికెన్ కొరత వల్ల కూడా ఆస్ట్రేలియాలోని కేఎఫ్సీ తన మెన్యూను పలుమార్లు సవరించింది.