సిడ్నీ: ఆంగోలా గనుల్లో అతిపెద్ద పింక్ డైమండ్ లభ్యమైంది. గడిచిన 300 ఏళ్లలో ఇలాంటి వజ్రాన్ని చూడలేదని ఆ సైట్ ఆపరేటర్ ప్రకటించారు. లూలా రోజ్గా పిలుస్తున్న ఆ వజ్రం.. లూలో మైన్లో దొరికింది. అది 170 క్యారెట్ పింక్ డైమెండ్ అని లుకాపా డైమెండ్ కంపెనీ తెలిపింది. అతి సహజమైన రీతిలో దొరికిన అతి అరుదైన వజ్రాన్ని ఆంగోలా ప్రభుత్వం ఆహ్వానించినట్లు ఆపరేటర్ చెప్పారు. లూలో మైన్ నుంచి పింక్ వజ్రం లభించడం ఇది రెండవసారి అని ఆంగోలా గనులశాఖ మంత్రి డమాంటినో అజివేడో తెలిపారు. భారీ ధరకు ఆ వజ్రాన్ని అంతర్జాతీయ మార్కెట్లో అమ్మనున్నట్లు చెప్పారు. అయితే లూలో రోజ్ వజ్రాన్ని కటింగ్, పాలిషింగ్ చేయాల్సి ఉంటుంది. దాని వల్ల ఆ వజ్రం బరువు 50 శాతం తగ్గిపోతుంది. గతంలో 59.6 క్యారెట్ల పింక్ స్టార్ వజ్రాన్ని హాంగ్కాంగ్ వేలంలో సుమారు 71.2 మిలియన్ల డాలర్లకు అమ్మేశారు. కొత్తగా దొరికిన పింక్ డైమండ్ అంతకన్నా ఎక్కువ ధరకు అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయి.