మిస్సోరి: భారతీయ నృత్య కళాకారుడిని అమెరికాలో కాల్చి చంపారు. బెంగాల్కు చెందిన ప్రముఖ కూచిపూడి నృత్యకారుడు అమర్నాథ్ ఘోష్ మంగళవారం మిస్సోరిలోని సెయింట్ లూయిస్లో ఈవెనింగ్ వాక్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు.
కోల్కతాలో జన్మించిన ఘోష్ చెన్నైలో ఆర్ట్ అధ్యాపకునిగా పని చేశారు. వాషింగ్టన్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నారు. ఈ కాల్పుల కేసులో భారత ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ జోక్యం చేసుకోవాలని మృతుడి స్నేహితురాలు దేవోలినా భట్టాచార్జీ విజ్ఞప్తి చేశారు.