వాషింగ్టన్: అమెరికాలోని భారతీయ సంతతిరాలు షెఫాలీ రజ్దాన్ దుగ్గల్ ను నెదర్లాండ్స్ రాయబారిగా నియమించినట్లు అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన చేశారు. ఈ విషయాన్ని వైట్హౌజ్ తెలిపింది. జమ్మూకశ్మీర్ నుంచి వలస వెళ్లిన దుగ్గల్ ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె వయసు 50 ఏళ్లు. సిన్సినాటి, చికాగో, న్యూయార్క్, బోస్టన్ నగరాల్లో ఆమె తన జీవితం గడిపారు. శుక్రవారం రోజున పలు దౌత్యపరమైన పోస్టులకు చెందిన నియామకాలపై వైట్హౌజ్ ప్రకటన చేసింది. దుగ్గల్కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. క్రియాశీల రాజకీయ కార్యకర్తగా ఆమెకు గుర్తింపు ఉన్నది. మహిళల, మానవ హక్కుల కోసం పోరాటం చేశారు. న్యూయార్క్ వర్సిటీలో పొలిటికల్ కమ్యూనికేషన్లో ఆమె ఎంఏ చదివారు. మియామీ వర్సిటీలో ఆమె మాస్ కమ్యూనికేషన్ పట్టా పొందారు.