మాస్కో, డిసెంబర్ 8: జపాన్కు చెందిన బిలియనీర్ యుసాకు మయెజవా, ఆయన ప్రొడ్యూసర్ యోజో హిరానో బుధవారం అంతరిక్ష యాత్రకు వెళ్లారు. గత దశాబ్ద కాలంలో వ్యక్తిగత ఖర్చులతో అంతరిక్ష యాత్రకు వెళ్లిన తొలి పర్యాటకులు వీరే. ఈ యాత్రను చిత్రీకరించాలని భావిస్తున్న వీరిద్దరూ రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ మిసుర్కిన్తో కలిసి రష్యన్ సోయజ్ ఎంఎస్-20 వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్)పయనమయ్యారు. కజకిస్థాన్లోని బైకనూర్ ప్రయోగ కేంద్రం నుంచి బుధవారం మధ్యాహ్నం 12.38 గంటలకు ఈ నౌక బయల్దేరింది. వీరు ఐఎస్ఎస్లో 12 రోజులుపాటు గడపనున్నారు. చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టేందుకు కూడా మయెజవా టికెట్ బుక్ చేసుకోవడం గమనార్హం. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ ‘టెస్లా’ అధిపతి ఎలాన్ మస్క్కు చెందిన స్టార్షిప్ ద్వారా మయెజవా మరో ఎనిమిది మంది కంటెస్టెంట్ విన్నర్లతో కలిసి ఈ యాత్రకు వెళ్లనున్నారు.