టోక్యో: జపాన్ భూకంపం(Japan Earth Quake)లో మృతిచెందిన వారి సంఖ్య 48కి చేరుకున్నది. ఇషికావా కేంద్రంగా 7.6 తీవ్రతతో భూకంపం నమోదు అయిన విషయం తెలిసిందే. ఇవాళ కూడా జపాన్లో ప్రకంపనలో నమోదు అవుతున్నాయి. ఇషికావాలో ఇవాళ మరోసారి 4.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. సోమవారం వచ్చిన భూకంపం.. నాటో ద్వీపంలో నమోదు అయిన అతిపెద్ద భూకంపం అని అధికారులు పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇవాళ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించింది. ప్రతి ఒక్కర్ని కాపాడుకోవాలని, విధ్వంసం వల్ల జరిగిన నష్టం పరిస్థితి గురించి ఆలోచించాలని ప్రధాని ఫుమియో కిషిదా పేర్కొన్నట్లు జపాన్ మంత్రి వెల్లడించారు. జపాన్ ప్రజలు అంతా అలర్ట్గా ఉండాలని, ఎందుకంటే రాబోయే వారం వరకు ఏడు తీవ్రతతో భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు మంత్రి హయషి తెలిపారు.