లంగన్, మే 22: పీడ కలలు, భ్రమ, పగటి కలలు ఎక్కువగా రావడం.. లూపస్ వంటి జబ్బులకు సూచనలు కావొచ్చని లండన్కు చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, కింగ్స్ కాలేజ్ లండన్కు చెందిన పరిశోధకులు లూపస్ సహా ఇతర ఆటోఇమ్యూన్ వ్యాధులకు గురైన 69 మంది పేషెంట్లు, వారికి చికిత్స అందిస్తున్న 50 మంది వైద్యులను ఇంటర్వ్యూ చేశారు. ఈ అధ్యయనం వెల్లడైన అంశాలు ‘ఈక్లినికల్ మెడిసిన్’ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి.
ఈ పేషెంట్లలో ప్రతి ఐదుగురిలో ముగ్గురికి పీడ కలలతో నిద్ర చెదిరిపోయే లక్షణం కనిపించింది. వీరిలో మూడింట ఒక వంతు మందిలో ఏడాది తర్వాత లూపస్ వ్యాధి మొదలైంది. లూపస్ వ్యాధి బారిన పడ్డ 85 శాతం మంది రోగులు ఎక్కువగా ‘భ్రమ పడటం’ లక్షణాన్ని అనుభవించారని తేలింది. రోగుల్లో ప్రతి ఐదుగురిలో ముగ్గురికి, ఇతర రుమటాలజీ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి ముగ్గురిలో ఒకరికి నిద్రలో కింద పడిపోయినట్టు, గాయపడ్డట్టు, భ్రమలు ఎక్కువగా వచ్చినట్టు గుర్తించారు. లూపస్ వ్యాధి మెదడు సహా వేర్వేరు భాగాలపై ప్రభావం చూపుతుంది.