జెరూసలేం : గాజాలో ఇజ్రాయెల్ అత్యంత భీకరమైన ‘వాక్యూమ్ బాంబ్’ను ప్రయోగించిందన్న ఆరోపణలు వెలువడ్డాయి. ‘ది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ’ నివేదిక ప్రకారం, ఈ బాంబులు మొదట గాలిలో భారీ అగ్ని గోళాన్ని సృష్టిస్తాయి. చుట్టుపక్కల గాలిని లాగటం ద్వారా ఒక రకమైన వాక్యూమ్ను సృష్టిస్తాయి.
అనంతరం ఏర్పడే పేలుళ్ల నుంచి ఉష్ణోగ్రత 3,500 డిగ్రీలకు చేరుకుంటుంది. ఈ బాంబుల్లో అల్యూమినియం, మెగ్నీషియం వంటి మూలకాలు.. కొన్ని సెకన్లలో మానవ శరీరాల్ని కాల్చేస్తాయి. అందువల్లే ఇజ్రాయెల్ దాడుల్లో చాలా మృతదేహాలు కనపడటం లేదని, 3,500 మందికిపైగా పౌరుల ఆచూకీ గల్లతైందని పేర్కొంటున్నారు.