బాగ్దాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) అధినేత అబూ హసన్ అల్-హషిమీ అల్-ఖురేషి హతమయ్యాడు. తమ నాయకుడు చనిపోయాడని ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఆడియో సందేశాన్ని విడుదల చేసింది. ఇరాక్లో శత్రువులతో జరిగిన యుద్ధంలో మృతిచెందినట్లు పేర్కొన్నారు. అయితే ఆయన ఎప్పుడు చనిపోయాడనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో ఖురేషి స్థానంలో కొత్త చీఫ్గా అబూ అల్-హుస్సేన్ అల్-హుస్సేని అల్-ఖురేషిని నియమించినట్లు అందులో తెలిపింది.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్లో ఐసిస్ చీఫ్ అబూ ఇబ్రహీం అల్-హషిమీని అమెరికా బలగాలు చుట్టుముట్టాయి. దీంతో అతడు తనకు తాను పేల్చుకుని చనిపోయాడు. దీంతో ఆయన స్థానంలో అబూ అల్ హసన్ ఐసిస్ పగ్గాలు చేపట్టాడు. పది నెలల వ్యవధిలోనే అతడు కూడా హతమయ్యాడు.