మాస్కో, ఆగస్టు 22: భారత్లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ భారీ దాడులకు ప్లాన్ చేస్తున్నది. ఆత్మాహుతి దాడులకు పాల్పడే ఉద్దేశంతో భారత్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సూసైడ్ బాంబర్ను రష్యాకు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బీ) పట్టుకున్నది.
నిందితుడు భారతలోని కీలక నేతపై దాడి చేసేందుకు కుట్రపన్నాడని తెలిపింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను ఐసిస్ టార్గెట్ చేసినట్టు తెలుస్తున్నది.