టెల్ అవివ్: ఇజ్రాయల్ రక్షణ దళం(IDF) ఇవాళ కీలక ప్రకటన చేసింది. తమ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాన్ని.. ఇరాన్కు చెందిన యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిస్సైల్ సిస్టమ్ అటాక్ చేసినట్లు పేర్కొన్నది. ఇరాన్ గగనవీధిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాన్ని పేల్చేందుకు ఇరాన్ ప్రయత్నించినట్లు ఐడీఎఫ్ చెప్పింది. సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ను ఇరాన్ లాంచ్ చేసిందని, కానీ తమ యుద్ధ విమానం ఆ క్షిపణిని గుర్తించి, ప్రమాదం నుంచి తప్పించుకున్నదని ఐడీఎఫ్ పేర్కొన్నది.
యాంటీ ఎయిర్క్రాఫ్ట్ అటాక్ చేసిన సమయంలో.. ఇజ్రాయెల్ ఫైటర్ పైలట్లు సంయమనంతో వ్యవహారించినట్లు ఐడీఎఫ్ చెప్పింది. దీని వల్ల తమ యుద్ధ విమానానికి ఎటువంటి డ్యామేజ్ కాలేదని పేర్కొన్నది. అనుకున్న రీతిలోనే మిషన్ను పూర్తి చేశామని ఐడీఎఫ్ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించేందుకు ఐడీఎఫ్ నిరాకరించింది.
ఇరాన్కు చెందిన యాంటీ ఎయిర్క్రాఫ్ట్ క్షిపణులు పలు సందర్భాల్లో ఇజ్రాయెల్ యుద్ధ విమానాన్ని టార్గెట్ చేశాయని, కానీ ఓ కేసులో మాత్రమే అతిసమీపంగా ఆ క్షిపణి వచ్చినట్లు చెప్పారు.