టెహ్రాన్: ఇరాన్లో మరో దారుణం వెలుగుచూసింది. సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీని కీర్తించే గీతం పాడనందుకు 16 ఏళ్ల బాలికను ఆ దేశ భద్రతా సిబ్బంది కొట్టి చంపారు. వాయువ్య అర్దబిల్ నగరంలో ఈ సంఘటన జరిగింది. గత వారం షహీద్ బాలికల ఉన్నత పాఠశాలను భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆ దేశ సుప్రీం నేతను కీర్తించే గీతాన్ని పాడాలని బాలికలను బలవంతం చేశారు. అస్రా పనాహి అనే 16 ఏళ్ల బాలిక నిరాకరించగా క్లాస్రూమ్లో అందరి ఎదుట ఆమెను దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరిన ఆ బాలిక చికిత్స పొందుతూ చనిపోయింది. అయితే ఆమె మరణానికి తాము బాధ్యులం కాదని ఆ దేశ అధికారులు తెలిపారు.
కాగా, ఇరాన్లో హిజాబ్కు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటిన తరుణంలో ఈ సంఘటన జరిగింది. బహిరంగ ప్రదేశంలో హిజాబ్ ధరించినందుకు 22 ఏళ్ల మహ్సా అమిని అరెస్ట్ చేసిన ఆ దేశ నైతిక పోలీసులు ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. దీంతో కోమాలోకి వెళ్లిన ఆ యువతి మరణించింది. ఈ సంఘటను ఖండిస్తూ ఇరాన్ మహిళలు హిజాబ్కు వ్యతిరేకంగా గళమెత్తారు. భారీగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నియంతృత్వ పాలన నశించాలని, తమకు స్వేచ్ఛ కావాలని డిమాండ్ చేశారు.