ఖాట్మండు: నేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. ఇమ్మిగ్రేషన్ సర్వర్లో సమస్యలు తలెత్తడంతో ఎయిర్పోర్టుకు రాకపోకలు సాగించే అంతర్జాతీయ విమానాలు దాదాపు రెండు గంటలకుపైగా నిలిచిపోయాయి. విమానాల రాకపోకలను పునరుద్ధంరించేదుకు ఎయిర్పోర్టు అధికారులు తీవ్రంగా శ్రమించారు.
ఇమ్మిగ్రేషన్ సర్వర్లో సమస్యలు తలెత్తడంవల్ల ఎయిర్పోర్టులో అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని, సిబ్బంది సుమారు రెండు గంటలకుపైగా శ్రమించి సమస్యను సరిచేశారని త్రిభువన్ ఎయిర్పోర్టు చీఫ్ ప్రేమ్నాథ్ ఠాకూర్ చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు.