జెరుసలాం: భారత్లోని యూద వర్గానికి చెందిన టీనేజర్ ఇజ్రాయిల్లో హత్యకు గురయ్యాడు. ఆ కేసులో 8 మందిని అరెస్టు చేశారు. వారంతా 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే. యోయిల్ లెహింగహల్ అనే 18 ఏళ్ల యువకుడు ఓ బర్త్ డే పార్టీలో కత్తి పోట్లకు బలయ్యాడు. ఈ ఘటన ఇజ్రాయిల్లోని కిరియత్ సొమోనా సిటీలో జరిగింది. యోయిల్ తన ఫ్యామిలీతో కలిసి ఏడాది క్రితమే ఇండియా నుంచి ఇజ్రాయిల్కు వలస వెళ్లాడు. నోఫ్ హగలిల్ అనే పట్టణంలో వారంటున్నారు.
ఈశాన్య భారతంలో ఉన్న భారతీయ యూదులు బినెయ్ మినాషే కమ్యూనిటీకి చెందినవాడతను. బర్త్డే పార్టీలో సుమారు 20 మంది యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆ పార్టీకి యోయిల్ హాజరయ్యాడు. బినెయ్ మినాషే యూద కమ్యూనిటీ ఇండియాలోని మణిపూర్, మిజోరం ప్రాంతంలో ఉంది. ఈ వర్గానికి చెందిన వాళ్లు గత రెండు దశాబ్ధాల నుంచి ఇజ్రాయిల్కు వలస వెళ్తున్నారు.