లండన్: భారత సంతతికి చెందిన 72 ఏళ్ల డాక్టర్ కృష్ణ సింగ్ మహిళా పేషెంట్లను వేధించిన కేసులో దోషిగా తేలాడు. స్కాట్లాండ్లో ప్రాక్టీస్ చేస్తున్న ఆ డాక్టర్ 35 ఏండ్లలో సుమారు 48 మంది మహిళా రోగులతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు నిర్ధారణ అయ్యింది. జీపీ డాక్టర్గా కొనసాగుతున్న కృష్ణ సింగ్.. మహిళా రోగులతో అనుచితంగా వ్యవహరించారు. ముద్దులు ఇవ్వడం, నెమరడం, అనవసరమైన పరీక్షలు చేయించడం, అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు డాక్టర్పై ఆరోపణలు ఉన్నాయి. గ్లాస్గోలోని హైకోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ జరిగింది. విచారణ సమయంలో పేషెంట్లు చేసిన ఫిర్యాదులను డాక్టర్ తప్పుపట్టారు. ఇండియాలో వైద్య శిక్షణ తీసుకున్న సమయంలో ఆ పరీక్షల గురించి నేర్చుకున్నట్లు ఆ డాక్టర్ చెప్పాడు.
1983 నుంచి 2018 మధ్య కాలంలో మహిళా రోగులతో డాక్టర్ కృష్ణ సింగ్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నార్త్ లనార్క్షైర్లో మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఎక్కువ శాతం నేరాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మహిళా రోగుల్ని లైంగికంగా వేధించినట్లు ప్రాసిక్యూటర్ ఏంజిలా గ్రే వాదించారు. డాక్టర్ కృష్ణ సింగ్కు స్కాట్లాండ్లో ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఆయనకు మెంబర్ ఆఫ్ బ్రిటీష్ అంపైర్ సత్కారం కూడా లభించింది. 2018లో ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఆ డాక్టర్ ప్రవర్తనపై విచారణ ప్రారంభించారు. మొత్తం 54 అభియోగాల్లో అతను దోషిగా తేలాడు. అయితే ఈ కేసులో తీర్పును వచ్చే నెలకు వాయిదా వేశారు. ప్రస్తుతం సింగ్కు బెయిల్ ఇవ్వాలని జడ్జి ఆదేశించారు.